తెలంగాణలోని విద్యుత్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను డిసెంబర్లో నిర్వహించారు.
అభ్యర్థులు తమ మార్కుల జాబితా కోసం tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ను చూడాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. 2,500 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (జేఏసీవో), 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్లో నోటిఫికేషన్లు విడులచేశారు.