ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. హైదరాబాద్ సైతం 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో హైదరాబాద్ 7 పరుగులు చేయగా.. ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచులో సన్రైజర్స్ అనుసరించిన వ్యూహాలపై ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ పై ఇప్పటికే సెహ్వాగ్ కామెంట్స్ చేయగా.. తాజాగా టాలీవుడ్ భామ ఈషా రెబ్బ.. సన్ రైజర్స్ కెప్టెన్ కు చురకలు అంటించింది. “వార్నర్ అన్నా..ఇదేంటి ? సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు నువ్వెందుకు వెళ్లవు ? బెయిర్ స్టో, సుచిన్ ను ఎందుకు కాదన్నావు ? నువ్వు ప్రయోగాలు చేయాలనీ అనుకుంటే డ్రీం-11 లో చేసుకో” అని వ్యాఖ్యానించారు. ఆమె కామెంట్లను చూసిన నెటిజన్లు… టెన్షన్ వద్దంటూ, ఇంకా మ్యాచులు ఉన్నాయంటూ ఈషా రెబ్బను ఓదార్చే ప్రయత్నం చేశారు.