ఏపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. కడప జిల్లాలోని పెద్దదర్గాను అఖిలప్రియ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కారణంగానే తామంతా తలెత్తుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగగలిగామని అఖిలప్రియ స్పష్టం చేశారు.
టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి చేపట్టిందనీ, మహిళలను ఆదుకుందని మంత్రి గుర్తుచేశారు. అందువల్లే దైర్యంగా ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు కోరామని పునరుద్ఘాటించారు. మే 23 తర్వాత ఏపీలో భారీ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అఖిలప్రియ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఉండాలని తాము కోరుకున్నట్లు అఖిలప్రియ తెలిపారు.
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్