telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 2,892 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,892 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో మృతి చెందగా, 2,240 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,341 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 97,402 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 846కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 477 మంది కోవిడ్ బారిన పడ్డారు.

Related posts