వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామెర మండలం పసరగొండ సమీపంలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఇసుక లారీ, ఓ కారు ఢీ కొన్నాయని పోలీసులు తెలిపారు. మృతులంతా జిల్లా పరిధిలోని పోచం మైదాన్ కు చెందిన వారని, వారిని మేకల రాకేశ్, చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా గుర్తించామన్నారు.
ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. , ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు: శ్రీకాంత్ రెడ్డి