telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ…

Somu Veerraju BJP

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన భారీ స్కామ్ పై సీఐడీ కేసు వేగంగా, నిష్పక్షపాతంగా విచారించి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఏపీ సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖ రాశారు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు టెండర్లు పిలిచిందని అలా బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టేలీ మాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండరు ఖరారు చేసిందని పేర్కొన్నారు. ఈ టెండరులో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండరు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయని అన్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతం పెంచేసి మోసానికి పాల్పడిందన్న ఆయన ఏడాదికి రూ. 460 కోట్ల భారీ మొత్తానికి టెండరు కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని తెలిసిందని పేర్కొన్నారు.

Related posts