భారత్ లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో బంగ్లాదేశ్ కు దిగుమతి నిలిపివేశారు. దీంతో బంగ్లాదేశ్లో కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన నివాసంలో ఉల్లి వాడొద్దని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసినా నిర్ణయం తీసుకున్నారు. కాగా, భారత్ లోని పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ.70కి చేరిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంటలు దెబ్బతినడంతో ఒక్కసారిగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి.
రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం: పవన్ కల్యాణ్