హైదరాబాద్లోని నాచారం పారిశ్రామికవాడలో అక్రమంగా తయారుచేస్తున్న ల్యాబ్ను నార్కొటిక్ అధికారులు గుర్తించారు. గత ఐదేళ్లుగా ‘డేట్ రేప్ డ్రగ్’ తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కెటమిన్ డ్రగ్ను బెంగళూరులో సరఫరా చేస్తున్న ముఠా ఒకటి ఎన్సీబీ అధికారులకు పట్టుబడింది. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారించడంతో ఈ డ్రగ్స్ను నాచారం పారిశ్రామిక వాడలోని ఇంకెమ్ ల్యాబ్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
బెంగళూరు ఎన్సీబీ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి అధికారులతో కలిసి ఇంకెమ్ ల్యాబ్పై దాడులు నిర్వహించారు. ల్యాబ్ను సీజ్ చేసి కంపెనీ డైరెక్టర్ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కెటమిన్ డ్రగ్ను మహిళలపై ప్రయోగిస్తే ఐదు గంటల పాటు మత్తులో ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ను మహిళలకు ప్రయోగించి వారిపై అగాయిత్యాలకు పాల్పడినట్లుఅధికారులకు గుర్తించారు.
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్రెడ్డి