మతాలను వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. కులాలను, మతాలను వాడుకునే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడి ముందు వివాదాలు సృష్టించడం సరికాదని ఆయన హితవుపలికారు. ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి ఒక్క జాతీయ పార్టీకే ఉందని చెప్పారు.
కోర్టులు కూడా సంయమనం పాటించాలని సూచించారు. హోదా ఎవరిస్తే వారికే మద్దతని ప్రతిపక్ష నేత జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. అధికారం కోసం పాదయాత్రలు చేస్తే గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. అసెంబ్లీకి వెళ్తే ఎమ్మెల్యేలను కొంటారని జగన్ భయమని రఘువీరా ఎద్దేవాచేశారు.