telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : కమిన్స్ హాఫ్ సెంచరీ… ముంబై లక్ష్యం..?

ఐపీఎల్ 2020 లో ఈ రోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ను ముంబై బౌలర్లు బాగా దెబ్బతీశారు. ముంబై బౌలింగ్ అటాక్ ముందు కేకేఆర్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ తర్వాత ఒక వికెట్ పడకుండా నిర్ణిత 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. కెప్టెన్ మోర్గాన్ తమ ఫాస్ట్ బౌలర్ కమిన్స్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడు. అయితే మ్యాచ్ చివరి వరకు నిలిచిన కెప్టెన్ 29 బంతుల్లో 39 పరుగులు చేయగా కమిన్స్ మాత్రం 36 బంతుల్లో 53 పరుగులతో తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇక ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా నాథన్ కౌల్టర్-నైలు, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ముంబై 149 పరుగులు చేయాలి. మరి కేకేఆర్ తన బౌలింగ్ అటాక్ తో స్ట్రాంగ్ బ్యాటన్గ్ లైన్ అప్ ఉన్న ముంబై ని ఓడిస్తుందా.. అనేది చూడాలి.

Related posts