telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గోదావరిలో లాంచీ తిరిగేందుకు అనుమతి లేదు: మంత్రి అవంతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండల టూర్‌కు బయలుదేరిన టూరిజం బోట్ నీట మునిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి పయనమయ్యారు. గోదావరిలో లాంచీ తిరిగేందుకు పర్యాటక శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కాకినాడ పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని లాంచీని తిప్పుతున్నారని తెలిపారు. సహాయ చర్యల కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా 25 మంది ఆచూకి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

Related posts