telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దళితుడ్ని సీఎం చేస్తామని కేసీఆర్ మాటతప్పారు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మరోసారి మండిపడ్డారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాకారమైతే దళితుడ్నే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని అన్నారు. రాష్ట్రంలో దళితులను అవమానానికి గురిచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ పనిచేయలేదని విమర్శించారు.

దళిత బస్తీ పేరిట దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, ఎందుకూ పనికిరాని భూములు పంపిణీ చేశారని ఆరోపించారు., తద్వారా దళితులను వంచించారని లక్ష్మణ్ మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను బీజేపీ సమర్థంగా తిప్పికొడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts