telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు: చంద్రబాబు ఫైర్

chandrababu

తమ హయాంలో పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పేదల కోసం నాడు టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించిందని వెల్లడించారు. మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. మరో 4.02 లక్షల మందికి 7,475 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని తెలిపారు.

అయితే, గత ఏడాదిగా ఇళ్ల పనులన్నీ ఆపేశారని, టీడీపీపై అక్కసుతో పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ ఓ కుంభకోణంలా మారిందని, ఎకరా రూ.7 లక్షల విలువ చేయని భూములను రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలం కావాలంటే రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.1.5 లక్షలు అంటూ రేట్లు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

Related posts