బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జిల్లాలోని టేకుమట్లా మండలం కుందనపల్లి దగ్గర చలి వాగులో 12 మంది రైతులు చిక్కుకుపోయారు. వాగులో చిక్కుకున్న రైతులను బయటకు తీసేందుకు రెండు హెలికాప్టర్ల సాయంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొద్దీ సేపట్లో 12 మంది రైతులను బయటకు తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.