ఎందరో త్యాగాలతో స్వాతంత్ర్యం పొందిన ఈ దేశంలో గాలి పీల్చడం మన అదృష్టమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ చేతన ఫౌండేషన్ ఈరోజు గాయకుడు జాన్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది.
జూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ, సినీ కవి సుద్దాల అశోక్, గాయకుడు జాన్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. ఇతరులకు సహాయం చేయడమే అసలైన జీవితమని లక్ష్మీనారాయణ చెప్పారు.
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేతగానే ఉండి ఉంటే ఆయన విగ్రహాన్ని ఎప్పటికీ పెట్టేవారు కాదని…ఆయన మిలిందా గేట్స్ ఫౌండేషన్ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా సేవ చేయడం ప్రారంభించిన తర్వాతే ఆయనకు ఎంతో గొప్ప పేరు వచ్చిందని చెప్పారు. ఏదో ఒకరోజు ఆయనకు కూడా విగ్రహం పెడతారని అన్నారు.
రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి