telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కార్తికేయ చావుకబురు చల్లగా ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్‌ లో ప్రస్తుతం మంచి బజ్ ఉన్న సినిమాల్లో చావుకబురు చల్లగా కూడా ఒకటి. కార్తికేయ హీరోగా తెరకెక్కతున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అంతకు అంతా పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుంది . ఈ విషయాన్ని ప్రకటిస్తూ చితబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ నెల 5న సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కార్తికేయ ‘బ‌స్తీ బాల‌రాజు’,  లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కౌషిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts