telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తా: స్పీకర్

ap speaker tammineni

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు సీఎం జగన్ ను ఉద్దేశించి ‘ఉన్మాది’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాసనసభలో పెను దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయగా… క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు. సభ సంప్రదాయాల ప్రకారం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనని… ఈ విషయాన్ని చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. లేని పక్షంలో చంద్రబాబు వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ నేపథ్యంలో స్పీకర్ స్పందిస్తూ.. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తానని తెలిపారు.

Related posts