telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీవో 2430 రద్దు చేయాలని గవర్నర్ కు చంద్రబాబు వినతి

chandrababu

ఏపీలో మీడియాపై ఆంక్షలు విధించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని అసెంబ్లీలో స్పీకర్ ను కోరారు. జీవో 2430 రద్దు చేయాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వినతి పత్రం ఇచ్చారు. గవర్నర్ ను కలిసిన వారిలో చంద్రబాబునాయుడితో పాటు మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

ఏబీఎన్, ఈ టీవీ, టీవీ5 ఛానళ్ల రిపోర్టర్లను ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని గవర్నర్ కు వారు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ రోజు ఇదే విషయాన్ని చంద్రబాబు అసెంబ్లీ లో కూడా ప్రస్తావించారు. మీడియాపై ఆంక్షలు వద్దంటూ స్పీకర్ ను కోరారు.

Related posts