telugu navyamedia
రాజకీయ వార్తలు

భార‌త్ స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం: డబ్ల్యూ హెచ్ ఓ

who modi

క‌రోనా క‌ట్ట‌డికి భార‌త్ స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ) తెలిపింది.భారత్‌లో కరోనా వైరస్ ను  కట్టడి చేసేందుకు  మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది.

కోవిడ్-19 వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యలను ఆ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ ప్రశంసించారు. భార‌త్ తీసుకుంటున్న‌ చర్యల ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. కానీ ఆరువారాల లాక్‌డౌన్‌తోపాటు సామాజిక దూరం, వైద్యసేవల విస్తరణ, రోగులకు ఐసోలేషన్‌, రోగులను గుర్తించటంలో చూపుతున్న వేగం వల్ల వైరస్‌ వ్యాప్తి అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.

Related posts