telugu navyamedia
Uncategorized

ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల!

ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018-19 విద్యా సంవత్సరానికి చెందిన రూ. 1,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై కీలక నిర్ణయం తీసుకొంది. తొమ్మిది నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని విద్యార్థినీ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలోకే నేరుగా వేయనున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం రూ. 35000 ఫీజు రీయింబర్స్ మెంట్ గరిష్ట పరిమితిని పెట్టడంతో, మిగతా ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆయా కాలేజీ యాజమాన్యాలు వసూలు చేశాయి. అలా వసూలు చేసిన అదనపు మొత్తాన్ని ఆయా విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని, కాలేజీలను ఆదేశిస్తూ, ఆ బకాయిలను కూడా ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది. 191 కాలేజీలకు ఆదేశాలు ఇప్పటికే ఇచ్చామని తెలిపారు. వారి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు సక్రమంగా డబ్బు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని జగన్ స్పష్టం చేశారు.

Related posts