ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించిన తరువాత ఈ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ప్రతిరోజూ స్కూళ్లలో విద్యార్దులు, ఉపాద్యాయుడు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,539 కరోనా కేసులునమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది.
ఇందులో 19,79,704 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 14,448 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 12 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,778కి చేరింది.
చిత్తూరులో 243, తూర్పుగోదావరి జిల్లాలో 228, గుంటూరులో 127, కృష్టాజిల్లాలో 194, నెల్లూరులో 176, ప్రకాశంలో 126, పశ్చిమ గోదావరిలో 163 కేసులు నమోదయ్యాయి.
సచివాలయాన్ని కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు: రేవంత్ రెడ్డి