*ఢిల్లీలో అధినేత చంద్రబాబు కు బోకే ఇచ్చేందుకు వంశీ నిరాకరణ..
*టీడీపీలో చర్చానీయాంశంగా మారిన కేశినేని నాని వ్యవహారం
*పార్టీ అధినేత ముందే అసహనం..
*గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలపై కేశినేని నాని
*నాని తీరుతో అవాక్కైన చంద్రబాబు , టీడీపీ నేతలు
టీడీపీలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వ్యవహారం చర్చానీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు .
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి టీడీపీకి చెందిన ఎంపీలు వచ్చారు. అందులో కేశినేని నాని కూడా ఉన్నారు.
అయితే చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ కేశినేని నానికి కోరగా.. అయితే మీరే ఇవ్వడంటూ పుష్ప గుచ్ఛాన్ని కేశినేని నాని విసురుగా తోసేశారు. దీంతో అక్కడే ఉన్న చంద్రబాబు, టీడీపీ ఎంపీలు అవాక్కైయ్యారు. అనంతరం గల్లా జయదేవ్ చంద్రబాబుకు విమానాశ్రయంలో శాలువా కప్పి, బొకే ఇచ్చారు.
అయితే గత కొంతకాలంగా చంద్రబాబు తీరుపై కేశినేని నాని అసంతృప్తితో ఉన్న కేశినేని ఈ రోజు మరోసారి బట్టబయలైందితన తమ్ముడిని ప్రోత్సహించడంపై కేశినేని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటీవల కేశినేని చిన్ని మాట్లాడుతూ తన సోదరుడితో విభేదాలు ఇప్పుడు కాదు.. గత 30 ఏళ్ల నుంచి ఉన్నాయన్నారు.వి జయవాడ ఎంపీగా గెలిచే సత్తా తనకుందన్నారు. అది వెన్నుపోటు మాత్రం కాదన్నారు. కేశినేని నాని కన్నా..తనకు చంద్రబాబే ముఖ్యమన్నారు. ఇది అన్నదమ్ముల పోరా… అధిష్టానం ప్లానా? అనేది తేల్చుకోలేక తెలుగు తమ్ముళ్లు కొందరు సైలెంట్గా ఉన్నారట. తాజా ఘటన తరువాత ఏం జరుగుతోందో చూడాలి.
ప్రధాని హెలికాప్టర్ను తనిఖీ చేస్తే సస్పెండ్ చేస్తారా : యనమల