telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దీక్షలు చేపడుతున్న రైతులకు జనసేన మద్దతు

pawan-kalyan

రాజధాని కోసం దీక్షలు చేపడుతున్న రైతులకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం వారితో ఎలాంటి చర్చలు జరపకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజధాని రైతులపై నమోదు చేసిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

క్రిష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల రాకను నిరసిస్తూ వ్యతిరేకత వ్యక్తం చేసిన 426 మంది రైతులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రైతులపై కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను పంపిణీ చేస్తుంటే రైతులు అడ్డుకున్నారని, వాళ్ల భవిష్యత్తుకు భరోసా లేదని భావించి నిరసన వ్యక్తం చేశారని వివరించారు.

Related posts