telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ తీర్థం పుచ్చ‌కోనున్న దాసోజు శ్రవణ్​.. బండితో కలిసి ఢిల్లీకి ప‌య‌నం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్ బీజేపీలోకి చేరుతున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి‌ సంజయ్ తో క‌లిసి దాసోజు శ్రవణ్ ఈవేళ‌ ఢిల్లీ కి బయల్దేరారు. అక్కడ‌ బీజేపీ అగ్రనేతలు తో భేటీ కానున్నారు.

 జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాశోజు శ్రవణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన విష‌యం తెలిసిందే .

ఇప్ప‌టికే కాంగ్రెస్‌ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దాసోజు శ్రవణ్‌తో పాటు నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వంటి నాయకులూ కాషాయకండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ఈనెల 21న మునుగోడులో సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను   బండి సంజ‌య్‌ అహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు వివరించనున్నారు

Related posts