telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఐసోలేషన్‌లో వరుడు.. క్వారంటైన్‌లో వధువు!

కరోనా పరీక్షలు చేయించుకుని ఫలితం రాకముందే ఓ యవకుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో వధువుతో సహా 70 మందిని ఇబ్బందులకు గురిచేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరిగింది. మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.

కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు ఇచ్చి ఫలితం రాకముందే గ్రామానికి చేరుకుని ఈ నెల 10న ఎల్.తండాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అదే రోజు రాత్రి ఎల్.తండాలో ఏర్పాటు చేసిన విందులో వరుడు అస్వస్థతకు గరయ్యాడు. అదే సమయంలో అతడు కరోనా బారినపడినట్టు ఫలితం వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారంటైన్‌కు తరలించారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న మొత్తం 70 కుటుంబాల వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

Related posts