telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

kodali nani ycp

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై నిరసనలు వెల్లువిరుస్తున్న నేపేథ్యంలో అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, పేదలకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలు లేని ప్రాంతంలో రాజధాని ఎందుకని అన్నారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనూ చర్చించానని మ్నత్రి తెలిపారు.

అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా, వాటిని ఇవ్వవద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు. తన వాదనను విన్న తరువాత, సీఎం  ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని నాని పేర్కొన్నారు. పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తరువాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చానని అన్నారు.

Related posts