telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బీజేపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ…

ఏపీలో పంచైతే ఎన్నికలు జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఇక ఈ ఎన్నికల సమయంలో అక్కడ పార్టీ శ్రేణుల మధ్య గొడవలు వచ్చిన ఎన్నికల తరువాత కూడా గొడవలు జరుగుతున్నాయి.  తాజాగా నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలంలోని కొత్తపాలెంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  వైసీపీ…బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.  ఈ ఘటనలో 9 మంది వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.  గాయపడిన కార్యకర్తలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవలు సద్దుమణిగాయి.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసులో పోలీసులు ఎవరిని అరెస్ట్ చేతురు అనేది చూడాలి.

Related posts