telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

డాక్టర్‌ సుధాకర్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ

ap high court

ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారని సస్పెండైన విశాఖ ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు ఎటువంటి అనారోగ్యం లేదని వాదిస్తోన్న ఆయన తనను విశాఖ మానసిక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

సుధాకర్‌ పిటిషన్‌ పై ఈ రోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు వెకేషన్ తర్వాతకి వాయిదా వేసింది. కాగా, సుధాకర్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సీబీఐ అధికారులు మరో కేసు రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పూర్తిగా సీబీఐకు బదిలీ కావడంతో విశాఖ పోలీసుల దర్యాప్తు నిలిచిపోయింది.

Related posts