telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డాక్టర్ సుధాకర్‌ను కోర్టులో హాజరు పరచండి: హైకోర్టు

ap high court

విశాఖపట్టణానికి చెందిన అనెస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగును జతచేస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ హైకోర్టుకు లేఖ రాసింది. ఆమె రాసిన లేఖను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. దీనిని విచారించిన ధర్మాసనం డాక్టర్ సుధాకర్‌ను తమ ఎదుట హాజరు పరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ డాక్టర్ సుధాకర్ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు. హైకోర్టుకు అనిత పంపినది ఎడిట్ చేసిన వీడియో అని.. ప్రధానిని, ముఖ్యమంత్రిని సుధాకర్ దూషించిన వీడియోలను లేఖతో ఎందుకు జతచేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ఓ కానిస్టేబుల్ సస్పెండ్ అయినట్టు వివరించారు.

Related posts