telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన టీడీపీ

chandrababu tdp

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన టీడీపీని పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సిద్దమయ్యారు. పార్టీనీ బలోపేతం చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఎలాగైనా సరే 2024లో ఏపీలో మళ్లీ టీడీపీ జెండానే ఎగరేయాల్సిందే అన్నట్లు వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలో పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. ఇన్చార్జిలను మాత్రమే కాదు, ప్రతి రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక సమన్వయకర్తను కూడా నియమించినట్టు తెలిపారు.

కొత్త నియోజకవర్గ ఇన్చార్జిలు వీరే:

అనంతపురం-కాలువ శ్రీనివాసులు
అమలాపురం-రెడ్డి అనంతకుమారి
కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కడప-మల్లెల లింగారెడ్డి
నంద్యాల-గౌరు వెంకటరెడ్డి
రాజంపేట-రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి
హిందూపురం-బీకే పార్థసారథి
తిరుపతి-నరసింహ యాదవ్
చిత్తూరు-పులివర్తి నాని
నెల్లూరు-అబ్దుల్ అజీజ్
ఒంగోలు-నూకసాని బాలాజి
గుంటూరు-శ్రావణ్ కుమార్
బాపట్ల-ఏలూరి సాంబశివరావు
నరసరావుపేట-జీవీ ఆంజనేయులు
విజయవాడ-నెట్టెం రఘురాం
మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ
నరసాపురం-తోట సీతారామలక్ష్మి
ఏలూరు-గన్ని వీరాంజనేయులు
రాజమండ్రి-జవహర్
కాకినాడ-జ్యోతుల నవీన్
విశాఖపట్నం-పల్లా శ్రీనివాసరావు
అరకు-గుమ్మడి సంధ్యారాణి
శ్రీకాకుళం-కూన రవికుమార్
విజయనగరం-కిమిడి నాగార్జున
అనకాపల్లి-నాగ జగదీశ్వరరావు

Related posts