తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. అడుగడుగునా ఆంధ్రులను అవమానించారని దుయ్యబట్టారు. ఏపీకి హోదాపై తొలిసంతకం అన్నందుకే సోనియాను కేసీఆర్ దుర్భాషలాడారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ గడ్డపై ఏపీకి హోదా గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఏపీకి కేసీఆర్ నీళ్లు రానివ్వడు. సాగర్, శ్రీశైలం నిర్వహణ తనదే అంటాడని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ కేసులు ఎందుకేశారు? అని ప్రశ్నించారు. ఆంధ్రులను అడుగడుగునా ఎందుకు అవమానిస్తున్నారని మండిపడ్డారు. వీటిపై కేసీఆర్ను నిలదీసే ధైర్యం జగన్కు ఉందా? అని సీఎం ప్రశ్నించారు. ఫెడరల్ఫ్రంట్ పేరుతో కేసీఆర్తో కలిసి జగన్ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రా ద్రోహి జగన్కు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.