సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకీ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ గట్టి షాకిచ్చింది. ఆ పార్టీకి సంబంధం ఉన్న సుమారు 687 పేజీలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్తో సంబంధం ఉన్న వ్యక్తుల నకిలీ ఖాతాలను పేజీలను తొలగించినట్లు ఫేస్బుక్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్లో పనిచేసే వారి వ్యక్తిగత ఖాతాలతో సంబంధం ఉన్న ఎఫ్బీ పేజీలను తొలగించినట్లు ఫేస్బుక్ సైబర్సెక్యూర్టీ హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు. యూజర్లను తమ పోస్టులతో తప్పుదోవ పట్టిస్తున్నందు వల్లే ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు ఎఫ్బీ తెలిపింది.