telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు రాయలసీమ ద్రోహి: వైసీపీ

tdp chandrababu

కర్నూలులో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థులు వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకున్న టీడీపీకి వ్యతిరేకంగా ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయం ముందు రాస్తారోకో చేశారు. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు కడపలోని ఏడు రోడ్ల కూడలిలో టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. శాసనమండలిలో టీడీపీ తీరును నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Related posts