మహిళలపై పోలీసుల లాఠీచార్జి పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఘాటుగా స్పందించారు. అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు లాఠీలతో అడ్డుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు.
కనక దుర్గ దేవాలయంలో పూజలు చేయడానికి వెళుతున్న రైతులు, మహిళలపై హేయమైన రీతిలో పోలీసులు చర్యలు చేపట్టి తమ స్థాయిని దిగజార్చుకున్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛను వీరు మరచిపోయినట్టున్నారు’ అని గల్లా ట్వీట్ చేశారు.