తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డేటా చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య రగిలిపోతుంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై హైదరాబాద్ లో కేసు నమోదయింది.
ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసుల సోదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రవాదులతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన వ్యాఖ్యలతో చంద్రబాబు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరో రెండు టర్మ్లు నేనే సీఎంగా ఉంటా.. అసెంబ్లీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు