telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మీడియా వ్యక్తి పై దాడి చేసిన కార్పొరేటర్ అభ్యర్థి అనుచరులు…

సామ.తిరుమల్ రెడ్డి ప్రస్తుతం హయత్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే ఆయన భూ కబ్జా చేశాడని నల్లగొండకు చెందిన ఓ కుటుంభం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆందోళనను చిత్రీకరిస్తున్న ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ పై తిరుమల్ రెడ్డి అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. హయత్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి  సామ.తిరుమల్ రెడ్డి భూ కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంభం ఆందోళనకు దిగింది. హయత్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి తన తమ్ముడు శ్రీధర్ రెడ్డి తో కలిసి తన ప్లాట్ కబ్జా చేశారని మా ఫ్లాట్ మాకు ఇప్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో సహా వచ్చి అంబేద్కర్   విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్లినా మాకు న్యాయం జగలేదని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మీడియా రిపోర్టర్ మీద దాడితో ఇక హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి ఇంటి ముందు జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. జర్నలిస్టుల పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. 

Related posts