telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ దీన్ని విద్వేష నగరం చేయాలని చూస్తుంది…

KTR TRS Telangana

ఈరోజు కేటీఆర్ జహీర్ నగర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. అందులో కేటీఆర్ మాట్లాడుతూ… గండిపేట కు రెట్టింపు స్థాయిలో కేశవ పూర్ రిజర్వాయర్ నిర్మాణం చేయిస్తాం అన్నారు. హైదరాబాద్ లో అన్నపూర్ణ పథకం, బస్తి దవాఖానలను ఏర్పాటు చేసాం. 6 ఏళ్ల నుంచి హైదరాబాద్ అభివృద్ధి పథంలో పోతుంది. కానీ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ జవదేకర్ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఛార్జి షీట్ విడుదల చేసారు. చార్జీ షీట్ వేయాల్సి వస్తే… 135  కోట్ల చార్జీ షీట్లు మీ మీద వెయ్యాలి. బీజేపీ నేతలు సిగ్గు, నీతి లేకుండా మాట్లాడుతున్నారు. గెలిపిస్తే 25 వేలు ఇస్తామని కొందరు అంటున్నారు…ఈ రోజు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ? బీజేపీ నేతల దగ్గర విషయం లేదు కాబట్టి విషం చిమ్ముతున్నారు అని పేర్కొన్నారు.. హైదరాబాద్ ను విష్వ నగరం చేయాలని టీఆర్ఎస్ ఆలోచన అయితే…బీజేపీ దీన్ని విద్వేష నగరం చేయాలని చూస్తుంది. ఇప్పుడు అప్పిన వరద సాయం ఎన్నికల తర్వాత అందిస్తాం అని తెలిపారు.

Related posts