telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమిత్‌ షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

Amit

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కరోనాను జయించిన అనంతరం అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం అమిత్‌ షా ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కాగా ఈ నెల 2న అమిత్‌ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన.. కరోనా నుంచి కోలుకుని ఆగస్ట్‌ 14న ఇంటికి వచ్చారు. అయితే ఒళ్లు నొప్పులు తగ్గకపోవడంతో ఆగష్టు 18న అమిత్‌ షా ఎయిమ్స్‌లో చేరారు. అత్యుత్తమ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఆయనను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Related posts