భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు మూడో వన్డే జరుగుతుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఈ నేపథ్యంలో నేడు రాంచీలో జరగనున్న వన్డేలో గెలిచి పట్టునిలుపుకోవాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు.
మరోవైపు ఈ వన్డేలో గెలుపొందడం ద్వారా టీ20 సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. తాజా వివరాల ప్రకారం ఆస్ట్రేలియా 6 ఓవర్లలో 25 పరుగులు సాధించి, నిలకడగా ఆడుతుంది. ఈ మ్యాచ్ లు బరిలోకి దిగనున్నఆటగాళ్ల వివరాలు ఇవే..
భారత జట్టు..
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, ధోని, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, షమీ, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు..
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖావాజా, షాన్మార్ష్, స్టొయినిస్, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, రిచర్డ్సన్, పాట్ కమిన్స్, నాథన్ లియోన్, ఆడమ్ జంపా