అమరావతిని పరిరక్షించాలని విజయవాడలో ఏర్పాటు చేసుకున్న జేఏసీ కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. నగరంలోని బెంజ్ సర్కిల్ లోని వేదిక కల్యాణ మండపంను జేఏసీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తోంది. ఏపీ రాజధాని రైతులు, రాజకీయ నాయకులు జేఏసీగా ఏర్పడి ఈ ఫంక్షన్ హాల్ నేఎంచుకుంది.
ఈ నేపథ్యంలో పటమట వ్జాయవాడ పోలీసులు వచ్చి ఫంక్షన్ హాల్ కు తాళం వేసి, యజమాని చెన్నుపాటి వజీర్ కు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తాళాలు వేయగా ఈ ఉదయం జేఏసీ నాయకులు వచ్చి తీవ్ర ఆందోళన చేపట్టారు.