telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడు తెలంగాణలో మోదీ, రాహుల్‌ ప్రచారం 

PM Modi and Rahul tour in Telangana
ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇద్దరు  అగ్రనేతలు ఒకే రోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానుండగా.. రాహుల్‌గాంధీ మూడు సభల్లో పాల్గొననున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, వనపర్తి జిల్లా కేంద్రంలో, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించే సభలకు రాహుల్‌ హాజరు కానున్నారు. 
బీజేపీ సభకు ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఎన్‌.రాంచందర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఆదివారం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.  మరోవైపు రాహుల్‌గాంధీ సభలకు కాంగ్రెస్‌ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలుత నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి సభలో మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్‌ పాల్గొంటారు. అనంతరం జహీరాబాద్‌, హుజూర్‌నగర్‌ సభల్లో రాహుల్‌ ప్రసంగిస్తారు. 

Related posts