telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర సహకారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు: బండి సంజయ్

BJP Bandi sanjay

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారాంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారని విమర్శించారు.

కరోనా టెస్టులు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వైద్యులు, పాత్రికేయులకు కరోనా నుంచి రక్షణ కల్పించడంలో సర్కారు పనితీరు బాగాలేదని విమర్శించారు. కరోనాతో చనిపోతున్న వారి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

Related posts