telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

సమ్మె కొనసాగిస్తాం.. గాంధీ ఆసుపత్రి జూడాలు!

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై  దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాసింది.

తమ డిమాండ్ల పట్ల న్యాయం జరగకపోవడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ఆసుపత్రి సూపరిండెంట్ కు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తమకు సరైన విధంగా హామీ ఇవ్వలేకపోయారని వెల్లడించారు. కొవిడ్ కేసుల వికేంద్రీకరణ అంశం సహా తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని, దీనిపై ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts