ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్న డే-నైట్ టెస్టు ప్రాక్టీస్ కోసం భారత క్రికెటర్లు తమ ప్రత్యేక అభ్యర్థనని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ (ఎంపీసీఏ) కు తెలిపారు. గురువారం నుంచి ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా, ఆ తర్వాత 22 నుంచి కోలకతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డే-నైట్ రూపంలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డే-నైట్ టెస్టుకి ఈరోజు నుంచే ప్రాక్టీస్ మొదలెట్టాలని టీమిండియా జట్టు నిర్ణయించుకుంది. ఇండోర్ స్టేడియం ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈరోజు రాత్రి కాసేపు పింక్ బాల్తో ప్రాక్టీస్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీసీఏని భారత క్రికెటర్లు అభ్యర్ధించారు. దీనితో స్టేడియం క్యూరేటర్ సుమందర్ సింగ్ చౌహాన్ ఆ మేరకు పిచ్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ భారత జట్టు ఒక్కసారి కూడా డే-నైట్ టెస్టులు ఆడలేదు. దీనితో ఒరిజినల్ మ్యాచ్ లో పింక్ బాల్ లో ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున తగినంత ప్రాక్టీస్ చేయించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఫ్లడ్ లైట్ల వెలుగులో పింక్ బాల్ తో క్రికెటర్లు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఇన్నాళ్లు టెస్టుల్లో రెడ్ బాల్ తో భారత ఆటగాళ్లు టెస్టులు ఆడిన విషయం మనమందరం చూస్తున్నాము. టెస్టు క్రికెట్ లో గత నాలుగేళ్లుగా డే- నైట్ టెస్టులు జరుగుతున్నాయి. కానీ భారత క్రికెటర్లు మాత్రం పింక్ బాల్ తో ఆడటం తమకి అనుభవం లేదంటూ డే-నైట్ టెస్టుని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ తాజాగా భారత క్రికెటర్లని ఒప్పించడంతో సఫలమయ్యాడు. బంగ్లాదేశ్ జట్టు కూడా ఇప్పటి వరకూ డే- నైట్ టెస్టులు ఆడలేదు.
జగన్ ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నారు: చంద్రబాబు