గ్రామ, వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్లను ఉగాది రోజున సత్కరించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వలంటీర్లను సత్కరించనుంది ప్రభుత్వం. సేవా వజ్రకు రూ. 30 వేల నగదు, సేవా రత్నకు రూ. 20 వేలు, సేవా మిత్రకు రూ. 10 వేల నగదు పురస్కారాన్ని, శాలువాతో సత్కరించనుంది ఏపీ ప్రభుత్వం. సత్కారానికి నవరత్నాల అమలులో చూపిన చొరవ, కోవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం… ఏప్రిల్ 13 తేదీన వార్డు, గ్రామ వలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది.
next post