ఢిల్లీ : భారత్లో కరోనా రక్కసి మళ్లీ జడలు విప్పుతోంది. ఇప్పటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా, వాతావరణంలో మార్పులు, చలి పెరుగుతుండటం, జనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతుండటంతో నిన్న ఒక్కరోజే 10 వేల 197 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకే కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
అలాగే గడచిన 24 గంటల్లో 301 మరణాలు నమోదుకాగా, 12 వేల 134 మంది కరోనా నుంచి కోలుకునీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 28 వేల 555గా నమోదైంది. ఇంత తక్కువ యాక్టివ్ కేసుల సంఖ్య నమోదు కావడం 527 రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 113.68 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లను వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 62 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3 కోట్ల 38లక్షల 73 వేల 890 గా నమోదైంది.