లోక్ సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం శుక్రవారం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలతో పాటు పలువురు ముఖ్యనేతలు సైతం కాంగ్రెస్కు దూరమవుతున్న కారణంగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, లోక్సభ ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎన్నికల ప్రచార సభలపై చర్చించనున్నట్లు తెలిసింది.
శాసనసభలో కూడా కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా కార్యాచరణ జరుగుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో ఈరోజు గాంధీభవన్లో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి ఆర్.సి.కుంతియా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.