జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్య సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు కోవిడ్ బారిన పడుతున్నారు.
తాజాగా హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పోలీస్ శాఖ షాక్ కు గురైంది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించింది. వారిని క్వారంటైన్ కు తరలించారు. వారందరి నమూనాలను సేకరించి, కరోనా పరీక్షలకు పంపించారు.
రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది: సుజనా చౌదరి