కారోనా కట్టడికి లాక్ డౌన్ అమలవున్న నేపథ్యంలో నిరుపేదలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని లక్ష్మి గార్డెన్స్ లో ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్రావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిరుపేదలకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్బాబు