టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు గురువారం వైసీపీ మద్దతుగా భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద గజదొంగ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్పై 40 కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలన దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగిపోయిందన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయరన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని పార్టీలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మోహన్ బాబు మండిపడ్డారు. పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణంరాజును గెలిపించాలని కోరారు.